సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వినతి

హైదరాబాద్‌, ఆగస్టు ౩౦ ,(ఆరోగ్యజ్యోతి):  జాతీయ ఆరోగ్య మిషన్‌ కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే, సిపిఐ నాయకుడు కూనంనేని సాంబశివరావు కోరారు. కాంట్రాక్ట్‌ విధానాన్ని రద్దు చేసి, ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం తక్షణమే ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. జాతీయ ఆరోగ్య మిషన్‌ కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. నరసింహ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్‌ ఖన్నా కోరారు.